ఈ విశ్వంపై జీవి ఆవిర్భావం నుండి పరస్పర భావ వ్యక్తీకరణ జరుగుతూనే ఉంది. అంతర్నిహితమైన భావాన్ని ఎదుటి వారికి తెలియ చేసేందుకు భాష అవసరమైంది. అందరూ ఆ భాషను అర్ధం చేసుకునేందుకు శాస్త్రీయ విధానంతో కూడిన వ్యాకర్ణం రూపుదిద్దుకుంది. వ్యక్తిలోని భావ చైతన్యాన్ని ఎదుటి వారిని అలరిస్తూ వారి హృదయాలకు హత్తుకునేలా చెప్పడం కవిత్వంగా పరిచయమయింది. ధర్మాన్ని, సత్యాన్ని హితంగా చెప్పడం సాహిత్యంగా ప్రాచుర్యాన్ని పొందింది.. ఆనాటి నుండి నేటిదాక సమ సమాజంలోని మంచి చెడ్డలను ప్రతిబింబింపచేస్తూ ఆ సమాజం లోని అనాదరణీయమైన అంశాలను, అంధ విశ్వాసాలను ఖండిస్తూ కావ్యాలు వెలువడ్డాయి. సామాజిక అవసరాలు, బడుగు బలహీన వర్గాల చైతన్యం లక్ష్యంగా సాగిన కవిత్వంలో కూడా భావావేశం వర్ణనల నాశ్రయించింది. ఊహాతీతమేదీ కాదనే సత్యం ఆవిష్కృతమైంది కావ్యాలలో. భాషలో ప్రౌఢిమ పెరిగింది. ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావన, సామాజిక చైతన్యం, విశ్వ మానవ సౌభ్రాతృత్త్వం లాంటివి కావ్య వస్తువులయ్యాయి. భావనా పటిమ సర్వకాలీన సత్యాలకు నాంది పలికింది. మానవ సమాజ వికసన లక్ష్యంగా వాటికి అవసరమైన అన్నిరంగాలనూ సమన్వయపరుస్తూ ఎన్నో గ్రంథాలు ఆవిష్కృత మయ్యాయి. ఇలా ఎంత సాహిత్యం రూపు దిద్దుకున్నా పిపాసాయాత్త చిత్తులైన రసజ్ఞుల దాహార్తిని చల్లార్చలేక పోవడం వల్ల సాహిత్యం ఇంకా ఆవిర్భవిస్తూనే ఉంది... ఉంటుంది కూడా.
ఒక సమాజంలోని మానవ జీవనశైలి, విలువలు, సిద్ధాంతాలు, నవ్యావిష్కరణలు ఆ సమాజంలోని కవిత్వాలలో ఆవిష్కృతమౌతావి. సామాజిక వేత్తలు సమ సమాజంలో ఏయే మార్పును కోరుకుంటున్నారో అది సాహిత్యం ద్వారా సాహితీ వేత్తల ద్వారా ప్రకటితమౌతుంది. కావ్యాలుగా రూపు దిద్దుకొని తరువాతి తరాలకు అందించ బడుతుంది. ముందే చెప్పుకున్నట్లుగా, ప్రతి సమాజంలో, సాహిత్యంలో మంచి చెడులు ఉంటాయి. దానికి కారణం అది తత్కాలీన అవసరాల నేపథ్యంలో రూపు దిద్దుకోవడమే. పాతను ప్రాతిపదికగా తీసుకొని దాని కన్న ఉన్నత సమాజావిష్కరణకు వర్తమానంలో పునాదులు వేస్తూ భవితను దర్శించగలిగిన వాడే దార్శనికుడౌతాడు. అలాంటి కవిత్వమే నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. పాతను ద్వేషించడం వల్ల మాత్రమే క్రొత్త సమాజాన్ని ఆవిష్కరించ గలమనే భ్రమలో కవిత్వాన్ని వ్రాయడం ఆరంభిస్తే ఎన్నడూ సత్ఫలితాలను సాధించలేము. అపారమైన విజ్ఞానం ఏ ఒక్కని సొత్తు కాదు. ఎవరికీ పేటెంట్ హక్కు ఉండదు. భావాన్ని స్వేచ్ఛగా తెలుపుకోవచ్చు. నచ్చని వారు ఆదరించరు. నచ్చిన వారు ఆదరిస్తారు. తమదే పై చేయి కావాలని ద్వేషభావనతో రచనలు చేసేవారు ఏ కాలంలోనైనా ఆదరణీయులు కాలేరు. రచనలో కవి యొక్క కవితాత్మకత, రస పరిప్లుతమైన ఊహా శక్తిని గుర్తించి ఆనందించి మెచ్చుకో గలిగిన రసజ్ఞులు ఏ కాలంలో నైనా ఉత్తమ సాహిత్యాన్ని ఆదరిస్తారు.
వ్యక్తి ప్రతిభా పాటవాలు, దార్శనికత, సామాజిక స్ఫృహ, నిబద్ధత తన రచనలో పల్లవించాలి. ఏదో ఇజానికి కట్టుబడ్డాము... లేదా నాలుగు అక్షరాలు తెలుసు కాబట్టి ఏదో వ్రాద్దాం... అనుకోవడం దానిని ఏదో పత్రిక అచ్చు వేసింది... నలుగురు అంతేవాసులు భళీ అన్నారు కాబట్టి మనమే గొప్ప మనకు తెలియని దానిపై విషం చిమ్ముతూ సమాజంలో మెప్పు సాధిద్దామనుకునే రచయితల వల్ల ఏ సమాజానికీ ఉపయోగం ఉండదు.
అదీతి, బోధ, అవగతం, ప్రచారం అనే నాలుగు మార్గాల గుండా సాహిత్య ప్రస్థానం జరిగితే అది నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. అదీతి అంటే అధ్యయన అభ్యసనాదులను శ్రద్ధగా నిర్వహించడం. విస్తృత పఠన వల్ల విషయం పరిపూర్ణంగా కరతలామలకమై ఉంటుంది. ఇక బోధ.... అధ్యయనం చేసిన విషయాన్ని వివిధ గతులలో వివిధ కోణాలలో అర్థం చేసుకోవడం. క్షుణ్ణంగా లోతుగా హేతుబద్ధంగా పరిశీలించి విషయంపై సరైన విధానంలో ప్రజ్ఞాయుతుడై నిలవడం. ఇక అవగతం... పై విధానంలో అలవడిన విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఫలితాలను బేరీజు వేసుకుంటూ లోపాలను సరిచేసుకునే విధానాలను అన్వేషించుకుంటూ ముందుకు నడవడం. చివరగా.. ప్రచారం... అన్ని మార్గాలలో తనకు సంతృప్తి నిచ్చిన విషయాన్ని లేదా విజ్ఞానాన్ని సమాజంలో ప్రచారం చేయడం. అలా వెలుగు చూచిన విజ్ఞానం సర్వజనీనమై సర్వకాలీనమౌతుంది.
అలాకాక అధ్యయనం సరిగా లేక లోతుగా అవగాహన చేసుకోలేక పక్షపాత సహితంగా ఏదో కొన్ని ఇజాలకు కట్టుబడి (వాటిపై కూడా సరైన అవగాహన లేకుండా) వ్రాయాలి కాబట్టి వ్రాస్తూ అపరిణత మనస్కుల మెచ్చుకోలుతో ఉబ్బి తామేదో సాధించామనే భ్రమలో తామే సాహితీ వేత్తలమనుకునే వారి రచనలు ఏ ప్రయోజనాన్నీ పొందలేవు. మనం చూడవచ్చు.... ఈ మధ్యకాలంలో ఎందరో కవులు రచయితలు ఎన్నో రచనలు చేసారు. వాటిని గుర్తుపెట్టుకున్న వారు ఎంతమంది.
అలాగని అధ్యయనం చేయని వారి రచనలు శాశ్వతత్త్వాన్ని సంతరించుకోవా? అంటే... సంతరించుకోవనే నా నమ్మకం. ఈ నాటి డిగ్రీలతో పనిలేదు కాని పక్షపాత రహితంగా పైన ఉదహరించిన నాలుగు మార్గాలలో నుండి నడవని సాహిత్యం ఏ నాడూ పరిణతి నందలేదు. ప్రజ్ఞాపాటవాలు సహజమైనవే కావచ్చు కాని వాటికి సరిగా పదను పెట్టి సరైన మార్గంలో నడిపించక పోతే అది విపరీతమౌతుంది. "సాక్షర" విపరీతమైతే అది "రాక్షస" మౌతుంది.
నన్నయ నుండి ఈ నాటి యువకవుల వరకు వస్తున్న సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల వైవిధ్య భరిత కోణాలు ఆవిష్కృతమౌతాయి. అంతకన్నా ఉన్నతమైన ఆలోచనా విధానం తో రచనలు చేయాలనే తపన సృజనాత్మకతకు తెరతీస్తుంది. సమ సమాజ సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రాచీన విధానాలతో సమన్వయం చేసుకుంటూ క్రొత్త సమాజావిష్కరణకై తపించే రచనలకు విజ్ఞులు పట్టకడతారు. అది అభిలషణీయమని నా నమ్మకం.
మరొక్క విషయం.... ఇంత కసరత్తు చేసి చేసిన రచనలలో కూడా అన్ని రచనలనూ ఆదరించలేదు. వాటిని నిగ్గుదీసి అందులోని సారాన్ని గ్రహించిన పిమ్మటనే అవి సమాజ హితకరమైనవని నమ్మకం కుదిరాకనే ఆదరించింది. ఏ సమాజమూ సమకాలీన సాహితీ వేత్తలనందరినీ ఒప్పుకోలేదు. వారిలో ఆవిష్కృతమైన శీలం ప్రాతిపదికగానే వారిని గౌరవించింది. కాని ఈనాడు పరిస్థితులలో మార్పు వచ్చింది. అధ్యయనం తక్కువ... తెలిసిన నాలుగు మాటలనే అటు ఇటుగా త్రిప్పి వ్రాసి తామొక సాహితీవేత్తగా తమకు తామే గుర్తించుకుంటున్నారు. అందులోని భావనా విధానంలో కాని, భాషా విధానంలో కాని దొర్లిన లోపాలను ఎవరైనా ఎత్తి చూపితే సహించే ఔదార్యం వారిలో లేదు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనే మూర్ఖత్వం వారిలో ఆవిష్కృతమై ఉంది.
ఈ పరిస్థితిలో నుండి సాహితీ వేత్తలు ముఖ్యంగా అభివృద్ధిలోకి రావలసిన వారు బైటకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఔత్సాహికులైన యువ సాహితీవేత్తలే నవ సాహితీ భవన నిర్మాణంలో భాగస్వాములు కాగలుగుతారనే విశ్వాసంతో ఈ నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నాను.
పాలకుర్తి రామమూర్తి
ఒక సమాజంలోని మానవ జీవనశైలి, విలువలు, సిద్ధాంతాలు, నవ్యావిష్కరణలు ఆ సమాజంలోని కవిత్వాలలో ఆవిష్కృతమౌతావి. సామాజిక వేత్తలు సమ సమాజంలో ఏయే మార్పును కోరుకుంటున్నారో అది సాహిత్యం ద్వారా సాహితీ వేత్తల ద్వారా ప్రకటితమౌతుంది. కావ్యాలుగా రూపు దిద్దుకొని తరువాతి తరాలకు అందించ బడుతుంది. ముందే చెప్పుకున్నట్లుగా, ప్రతి సమాజంలో, సాహిత్యంలో మంచి చెడులు ఉంటాయి. దానికి కారణం అది తత్కాలీన అవసరాల నేపథ్యంలో రూపు దిద్దుకోవడమే. పాతను ప్రాతిపదికగా తీసుకొని దాని కన్న ఉన్నత సమాజావిష్కరణకు వర్తమానంలో పునాదులు వేస్తూ భవితను దర్శించగలిగిన వాడే దార్శనికుడౌతాడు. అలాంటి కవిత్వమే నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. పాతను ద్వేషించడం వల్ల మాత్రమే క్రొత్త సమాజాన్ని ఆవిష్కరించ గలమనే భ్రమలో కవిత్వాన్ని వ్రాయడం ఆరంభిస్తే ఎన్నడూ సత్ఫలితాలను సాధించలేము. అపారమైన విజ్ఞానం ఏ ఒక్కని సొత్తు కాదు. ఎవరికీ పేటెంట్ హక్కు ఉండదు. భావాన్ని స్వేచ్ఛగా తెలుపుకోవచ్చు. నచ్చని వారు ఆదరించరు. నచ్చిన వారు ఆదరిస్తారు. తమదే పై చేయి కావాలని ద్వేషభావనతో రచనలు చేసేవారు ఏ కాలంలోనైనా ఆదరణీయులు కాలేరు. రచనలో కవి యొక్క కవితాత్మకత, రస పరిప్లుతమైన ఊహా శక్తిని గుర్తించి ఆనందించి మెచ్చుకో గలిగిన రసజ్ఞులు ఏ కాలంలో నైనా ఉత్తమ సాహిత్యాన్ని ఆదరిస్తారు.
వ్యక్తి ప్రతిభా పాటవాలు, దార్శనికత, సామాజిక స్ఫృహ, నిబద్ధత తన రచనలో పల్లవించాలి. ఏదో ఇజానికి కట్టుబడ్డాము... లేదా నాలుగు అక్షరాలు తెలుసు కాబట్టి ఏదో వ్రాద్దాం... అనుకోవడం దానిని ఏదో పత్రిక అచ్చు వేసింది... నలుగురు అంతేవాసులు భళీ అన్నారు కాబట్టి మనమే గొప్ప మనకు తెలియని దానిపై విషం చిమ్ముతూ సమాజంలో మెప్పు సాధిద్దామనుకునే రచయితల వల్ల ఏ సమాజానికీ ఉపయోగం ఉండదు.
అదీతి, బోధ, అవగతం, ప్రచారం అనే నాలుగు మార్గాల గుండా సాహిత్య ప్రస్థానం జరిగితే అది నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. అదీతి అంటే అధ్యయన అభ్యసనాదులను శ్రద్ధగా నిర్వహించడం. విస్తృత పఠన వల్ల విషయం పరిపూర్ణంగా కరతలామలకమై ఉంటుంది. ఇక బోధ.... అధ్యయనం చేసిన విషయాన్ని వివిధ గతులలో వివిధ కోణాలలో అర్థం చేసుకోవడం. క్షుణ్ణంగా లోతుగా హేతుబద్ధంగా పరిశీలించి విషయంపై సరైన విధానంలో ప్రజ్ఞాయుతుడై నిలవడం. ఇక అవగతం... పై విధానంలో అలవడిన విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఫలితాలను బేరీజు వేసుకుంటూ లోపాలను సరిచేసుకునే విధానాలను అన్వేషించుకుంటూ ముందుకు నడవడం. చివరగా.. ప్రచారం... అన్ని మార్గాలలో తనకు సంతృప్తి నిచ్చిన విషయాన్ని లేదా విజ్ఞానాన్ని సమాజంలో ప్రచారం చేయడం. అలా వెలుగు చూచిన విజ్ఞానం సర్వజనీనమై సర్వకాలీనమౌతుంది.
అలాకాక అధ్యయనం సరిగా లేక లోతుగా అవగాహన చేసుకోలేక పక్షపాత సహితంగా ఏదో కొన్ని ఇజాలకు కట్టుబడి (వాటిపై కూడా సరైన అవగాహన లేకుండా) వ్రాయాలి కాబట్టి వ్రాస్తూ అపరిణత మనస్కుల మెచ్చుకోలుతో ఉబ్బి తామేదో సాధించామనే భ్రమలో తామే సాహితీ వేత్తలమనుకునే వారి రచనలు ఏ ప్రయోజనాన్నీ పొందలేవు. మనం చూడవచ్చు.... ఈ మధ్యకాలంలో ఎందరో కవులు రచయితలు ఎన్నో రచనలు చేసారు. వాటిని గుర్తుపెట్టుకున్న వారు ఎంతమంది.
అలాగని అధ్యయనం చేయని వారి రచనలు శాశ్వతత్త్వాన్ని సంతరించుకోవా? అంటే... సంతరించుకోవనే నా నమ్మకం. ఈ నాటి డిగ్రీలతో పనిలేదు కాని పక్షపాత రహితంగా పైన ఉదహరించిన నాలుగు మార్గాలలో నుండి నడవని సాహిత్యం ఏ నాడూ పరిణతి నందలేదు. ప్రజ్ఞాపాటవాలు సహజమైనవే కావచ్చు కాని వాటికి సరిగా పదను పెట్టి సరైన మార్గంలో నడిపించక పోతే అది విపరీతమౌతుంది. "సాక్షర" విపరీతమైతే అది "రాక్షస" మౌతుంది.
నన్నయ నుండి ఈ నాటి యువకవుల వరకు వస్తున్న సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల వైవిధ్య భరిత కోణాలు ఆవిష్కృతమౌతాయి. అంతకన్నా ఉన్నతమైన ఆలోచనా విధానం తో రచనలు చేయాలనే తపన సృజనాత్మకతకు తెరతీస్తుంది. సమ సమాజ సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రాచీన విధానాలతో సమన్వయం చేసుకుంటూ క్రొత్త సమాజావిష్కరణకై తపించే రచనలకు విజ్ఞులు పట్టకడతారు. అది అభిలషణీయమని నా నమ్మకం.
మరొక్క విషయం.... ఇంత కసరత్తు చేసి చేసిన రచనలలో కూడా అన్ని రచనలనూ ఆదరించలేదు. వాటిని నిగ్గుదీసి అందులోని సారాన్ని గ్రహించిన పిమ్మటనే అవి సమాజ హితకరమైనవని నమ్మకం కుదిరాకనే ఆదరించింది. ఏ సమాజమూ సమకాలీన సాహితీ వేత్తలనందరినీ ఒప్పుకోలేదు. వారిలో ఆవిష్కృతమైన శీలం ప్రాతిపదికగానే వారిని గౌరవించింది. కాని ఈనాడు పరిస్థితులలో మార్పు వచ్చింది. అధ్యయనం తక్కువ... తెలిసిన నాలుగు మాటలనే అటు ఇటుగా త్రిప్పి వ్రాసి తామొక సాహితీవేత్తగా తమకు తామే గుర్తించుకుంటున్నారు. అందులోని భావనా విధానంలో కాని, భాషా విధానంలో కాని దొర్లిన లోపాలను ఎవరైనా ఎత్తి చూపితే సహించే ఔదార్యం వారిలో లేదు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనే మూర్ఖత్వం వారిలో ఆవిష్కృతమై ఉంది.
ఈ పరిస్థితిలో నుండి సాహితీ వేత్తలు ముఖ్యంగా అభివృద్ధిలోకి రావలసిన వారు బైటకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఔత్సాహికులైన యువ సాహితీవేత్తలే నవ సాహితీ భవన నిర్మాణంలో భాగస్వాములు కాగలుగుతారనే విశ్వాసంతో ఈ నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నాను.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment