మహా భారతంలో కద్రువ, వినత ల కథ (సౌవర్ణోపాఖ్యానం)
పూర్వం కశ్యపుడనే మహాఋషికి కద్రువ, వినత లనే ఇరువురు భార్యలు ఉండేవారు. ఒకనాడు ఇరువురూ ఆయన వద్దకు సంతానాపేక్షతో వెళ్ళి ఆయనను భక్తితో సేవించారు. సంతోషించిన కశ్యపుడు వారిని అనుగ్రహంతో చూసి "మీకేం కావాలో కోరుకోండని" అన్నాడు. ఇదారూ తమకు సంతానం కావాలని ప్రార్థించారు. ఆ క్రమంలో కద్రువ... నాథా... వినుత సత్వులు, దీర్ఘదేహులు, అనలతేజులు (అగ్ని లాంటి తేజస్సు కలిగిన వారు) అయిన ఒక వేయి మంది పుత్రులు కావాలని కోరుకొన్నది. ఇక వినత... మంచి కుమారులు... కద్రువ సంతానానికన్న బలవంతులు, తేజో వంతులు అయిన ఇద్దరు కుమారులు కావాలని కోరింది. తధాస్తు అన్నాడు... కశ్యపుడు.
కశ్యప ప్రజాపతి చాలాకాలం తపస్సు చేసి.. పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించి ఆ ప్రసాదాన్ని వారికిస్తూ జాగ్రత్తగా గర్భాలను రక్షించుకోండని చెపుతూ తపస్సుకు వెళ్ళాడు. ఇక కద్రువ, వినతలు సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి.... గర్భవతులయ్యారు. కొంతకాలానికి ఆ గర్భాలు అండాలుగా మారడం జరిగింది. ఇరువురూ ఆ అండాలను నేతి కుండలలో భద్రపరచి జాగ్రత్తగా కాపాడారు. కొంతకాలానికి కద్రువ సంతానం ఒక్కటొకటిగా వెలుగు చూడడం జరిగింది. కద్రువకు మొత్తంగా వేయి మంది జనించారు. వినత భద్రపరచిన అండాలు అలాగే ఉన్నాయి. సవతికి సంతానం కలగడం, తన అండాలు అలాగే ఉండడం వల్ల మనసులో ఆందోళన... అపనమ్మకం, అసూయ ముప్పిరిగొనగా వినత తన రెండు అండాలలో ఒకదానిని విచ్ఛిన్నం చేసింది. అందులో నుండి క్రింది భాగం పూర్తిగా ఏర్పడని అనూరుడు (అనూరుడు... ఊరువులు లేని వాడు) జన్మించి... తల్లితో ఇలా అంటాడు. తొందరపాటుతో అసూయాగ్రస్తురాలివై నా శరీరం పూర్తిగా ఏర్పడక ముందే అండాన్ని బ్రద్దలు చేసావు... కాబట్టి నీ అవినీతికి ప్రాయశ్చిత్తంగా అయిదు వందల సంవత్సరాలు నీ సవతికి దాస్యం చేయి. అంతేకాదు... మిగిలిన ఆ అండాన్ని అది పక్వం అయేంతవరకూ ఛిద్రం చేయకు. ఆ అండంలోనుండి వెలువడే లోకోత్తరుడైన కుమారుడు నీ దాస్యాన్ని బాపుతాడు అంటూ.. సూర్యుని రధానికి సారధిగా వెళతాడు.
ఒకనాడు, సవతులిరువురూ సముద్ర తీరానికి వాహ్యాళికై వెళ్ళారు. అలా వారు విహరిస్తుండగా వారికి అక్కడ ఉచ్ఛైశ్రవం కనిపిస్తుంది. ఆ అశ్వాన్ని చూపిస్తూ కద్రువ వినతతో "పాలనురుగు లాంటి తెల్లని తెలుపుతో ఎంతో అందంగా ఉన్న ఆ గుర్రానికి చంద్రునిలో మచ్చ లాగా ఆ తోక నలుపుగా ఉండడం" బాగా లేదు కదా అంటుంది. దానికి ప్రతిగా వినత... అక్కా నీవే కన్నులతో చూస్తున్నావు.... ఆ హయానికి తోక కూడా తెల్లగానే ఉంది, అంటుంది. కద్రువ నల్లని తోక అని వినత కాదు అది తెల్లని తోక అని... ఇలా ఇరువురూ వాదించుకోవడం జరుగుతుంది. చివరగా... కద్రువ అంటుంది.... ఇన్ని మాటలెందుకు ఒక పందెం వేసుకుందాము; ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నాకు నీవు దాసివై ఉండు... అలాకాక తోక తెల్లనిదైతే నేను నీకు దాసి నౌతాను, అంటూ పందానికి రెచ్చగొడుతుంది. వినత సరేనని ఆ పందానికి ఒప్పుకుంటూ... దగ్గరకు వెళ్ళి చూద్దాం పదమంటుంది. దానికి ప్రతిగా కద్రువ... ఇప్పుడు ప్రొద్దు పోయింది... భర్త సేవ చేసుకోవలసిన సమయం ఆసన్నమయింది కాబట్టి తెల్లవారాక వెళ్ళి చూద్దామంటూ వినతతో కూడి వెనుకకు వస్తుంది. ఇంటికి వెళ్ళాక కద్రువ తన సంతానాన్ని పిలిచి... జరిగిన పందెం వివరాలు చెప్పి ఆ గుర్రం యొక్క తోకను ఎలాగైనా నలుపు చేయండని ఆజ్ఞాపిస్తుంది. పిల్లలెవరూ ఆ అధర్మానికి ఒప్పుకోరు. దానికి అశక్తతతో కూడిన కోపంతో కద్రువ తన సంతానాన్ని ముందుకాలంలో జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో మీరంతా భస్మమవండని శపిస్తుంది. తల్లి శాపానికి భయపడిన కర్కోటకుడు అనే సర్పం మాత్రం వెళ్ళి ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడుతూ గుర్రం తోక నల్లదనే భ్రమను కలిగిస్తాడు. తెల్లవారింది.. యధావిధిగా అనుకున్న విధంగా కద్రువ వినతలు ఇరువురూ ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఆ గుర్రాన్ని దూరం నుండే చూచారు. కర్కోటకుడు ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడడం మూలంగా ఆ తోక నల్లగా కనిపించడమూ... ఒప్పందం ప్రకారం వినత కద్రువకు దాసీగా మారడం జరుగుతుంది.
ఇలా ఐదు వందల సంవత్సరాలు గడచిపోయాయి.... ఒకనాడు వినత దగ్గరి అండం విచ్ఛిన్నమై గరుత్మంతుడనే పక్షి జనిస్తాడు. మహా బలవంతుడైన గరుడుడు కూడా తల్లి ఎలాగైతే కద్రువకు ఆమె సంతతికి దాసీత్వం చేస్తుందో అలాగే ఊడిగం చేస్తూంటాడు. ఒకనాడు.. ఆ పాములను తన వీపుపై మోస్తూ సూర్య మండలానికి ఎగరడం... ఆ తాపాన్ని భరించలేని పాములు భూమిపైపడి మూర్ఛ పోవడం, అది చూచిన కద్రువ కోపగించడం.... జరుగుతుంది. అప్పుడు, గరుత్మంతుడు తమ దాసీత్వం పోవాలంటే ఏం చేయాలని ఆ పాములను అడగడం వారు అమృతాన్ని తెచ్చిమ్మనడం... వారు కోరిన రీతిగానే దేవతలను జయించి గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి ఇస్తూ సర్పాలతో .... కృతస్నాతులై శుచిగా అమృతాన్ని సేవించడని చెప్పి... వారితో తన తల్లి దాసీత్వం పోయిందనిపించుకొని తల్లితో కలసి వెళ్ళిపోతాడు. ఆ పాములూ అమృతం లభించిందనే సంతోషంతో... ఆ అమృత భాండాన్ని శుచియైన ప్రదేశంలో దర్భలపై ఉంచి స్నానాదికాలు పూర్తి చేయడానికై వెళతారు. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి ఆ అమృత భాండాన్ని అపహరించుకొని వెళ్ళి దేవలోకంలో భద్ర పరుస్తాడు.
అమృతాన్ని తెచ్చే క్రమంలో ఆ అమృతాన్ని తాను ఉపయోగించని గరుడుని నిబద్ధతకు మరియు ఆతని జవసత్వాలను చూసి సంతోషించిన విష్ణువు గరుత్మంతుని తన వాహనంగా చేసుకుంటాడు.
స్థూలంగా ఇదీ కథ. ఇందులో ఎన్నో సందేహాలు..
౧) కశ్యపుడు మహాఋషి అన్నాము. ఋషి అంటేనే భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించ గలిగినవాడు. (అందులోనూ ఇతడు పశ్యకః...కశ్యప తిరగ వ్రాస్తే పశ్యక) అలాంటప్పుడు భార్యల కోరికలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయాడా?
౨) మహా తపస్వియైన భర్త చేసిన ఇష్టి యొక్క ప్రసాద మహాత్యాన్ని వినత నమ్మలేకపోయిందా లేక భర్తపై నమ్మకం పోయిందా? కద్రువకు సంతానం కలగగానే తన అండాన్ని విచ్ఛిన్నం చేయడం ఎందుకు?
౩) ఒక అంశంపై ఇరువురికీ వాద ప్రతివాదాలు చెలరేగాయి. పందెం వేద్దామనుకున్నారు. అది సహజమే కావచ్చు. కాని దానికి సొమ్ముల లాంటివి పందెంగా పెట్టడం సామాన్యమే కావచ్చు కాని ముందుకు ముందే దాసీత్వం పందెంగా వేసుకోవడం న్యాయమా?
౪) ఒక పెద్ద పందెం; అదీ జీవితాలకు సంబంధించినది ఐనప్పుడు, తెల్లవారి చూద్దాం లే అనే ప్రమత్తత ఉంటుందా?
౫) తెల్లవారి వెళ్ళి చూద్దామనుకున్నారు సరే! కాని ఆ తోక నలుపో తెలుపో దగ్గరకు వెళ్ళి చూస్తారే కాని దూరం నుండే దానిపై ఒక నిర్ణయానికి రావడం సమంజసమేనా? అలా ఎక్కడైనా జరుగుతుందా... అదీ దాసీత్వం పందెంగా ఉన్నప్పుడు.
౬) ఈ కథ ద్వారా వేద వ్యాసుడు ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడు?
ఈ సందేహాలు మీకూ వస్తే... నా ఆలోచనలు పంచుకునేందుకై రేపటి దాక వేచి ఉండండి. లేదా మీ మీ ఆలోచనలను పంచుకోండి
కశ్యప ప్రజాపతి చాలాకాలం తపస్సు చేసి.. పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించి ఆ ప్రసాదాన్ని వారికిస్తూ జాగ్రత్తగా గర్భాలను రక్షించుకోండని చెపుతూ తపస్సుకు వెళ్ళాడు. ఇక కద్రువ, వినతలు సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి.... గర్భవతులయ్యారు. కొంతకాలానికి ఆ గర్భాలు అండాలుగా మారడం జరిగింది. ఇరువురూ ఆ అండాలను నేతి కుండలలో భద్రపరచి జాగ్రత్తగా కాపాడారు. కొంతకాలానికి కద్రువ సంతానం ఒక్కటొకటిగా వెలుగు చూడడం జరిగింది. కద్రువకు మొత్తంగా వేయి మంది జనించారు. వినత భద్రపరచిన అండాలు అలాగే ఉన్నాయి. సవతికి సంతానం కలగడం, తన అండాలు అలాగే ఉండడం వల్ల మనసులో ఆందోళన... అపనమ్మకం, అసూయ ముప్పిరిగొనగా వినత తన రెండు అండాలలో ఒకదానిని విచ్ఛిన్నం చేసింది. అందులో నుండి క్రింది భాగం పూర్తిగా ఏర్పడని అనూరుడు (అనూరుడు... ఊరువులు లేని వాడు) జన్మించి... తల్లితో ఇలా అంటాడు. తొందరపాటుతో అసూయాగ్రస్తురాలివై నా శరీరం పూర్తిగా ఏర్పడక ముందే అండాన్ని బ్రద్దలు చేసావు... కాబట్టి నీ అవినీతికి ప్రాయశ్చిత్తంగా అయిదు వందల సంవత్సరాలు నీ సవతికి దాస్యం చేయి. అంతేకాదు... మిగిలిన ఆ అండాన్ని అది పక్వం అయేంతవరకూ ఛిద్రం చేయకు. ఆ అండంలోనుండి వెలువడే లోకోత్తరుడైన కుమారుడు నీ దాస్యాన్ని బాపుతాడు అంటూ.. సూర్యుని రధానికి సారధిగా వెళతాడు.
ఒకనాడు, సవతులిరువురూ సముద్ర తీరానికి వాహ్యాళికై వెళ్ళారు. అలా వారు విహరిస్తుండగా వారికి అక్కడ ఉచ్ఛైశ్రవం కనిపిస్తుంది. ఆ అశ్వాన్ని చూపిస్తూ కద్రువ వినతతో "పాలనురుగు లాంటి తెల్లని తెలుపుతో ఎంతో అందంగా ఉన్న ఆ గుర్రానికి చంద్రునిలో మచ్చ లాగా ఆ తోక నలుపుగా ఉండడం" బాగా లేదు కదా అంటుంది. దానికి ప్రతిగా వినత... అక్కా నీవే కన్నులతో చూస్తున్నావు.... ఆ హయానికి తోక కూడా తెల్లగానే ఉంది, అంటుంది. కద్రువ నల్లని తోక అని వినత కాదు అది తెల్లని తోక అని... ఇలా ఇరువురూ వాదించుకోవడం జరుగుతుంది. చివరగా... కద్రువ అంటుంది.... ఇన్ని మాటలెందుకు ఒక పందెం వేసుకుందాము; ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నాకు నీవు దాసివై ఉండు... అలాకాక తోక తెల్లనిదైతే నేను నీకు దాసి నౌతాను, అంటూ పందానికి రెచ్చగొడుతుంది. వినత సరేనని ఆ పందానికి ఒప్పుకుంటూ... దగ్గరకు వెళ్ళి చూద్దాం పదమంటుంది. దానికి ప్రతిగా కద్రువ... ఇప్పుడు ప్రొద్దు పోయింది... భర్త సేవ చేసుకోవలసిన సమయం ఆసన్నమయింది కాబట్టి తెల్లవారాక వెళ్ళి చూద్దామంటూ వినతతో కూడి వెనుకకు వస్తుంది. ఇంటికి వెళ్ళాక కద్రువ తన సంతానాన్ని పిలిచి... జరిగిన పందెం వివరాలు చెప్పి ఆ గుర్రం యొక్క తోకను ఎలాగైనా నలుపు చేయండని ఆజ్ఞాపిస్తుంది. పిల్లలెవరూ ఆ అధర్మానికి ఒప్పుకోరు. దానికి అశక్తతతో కూడిన కోపంతో కద్రువ తన సంతానాన్ని ముందుకాలంలో జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో మీరంతా భస్మమవండని శపిస్తుంది. తల్లి శాపానికి భయపడిన కర్కోటకుడు అనే సర్పం మాత్రం వెళ్ళి ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడుతూ గుర్రం తోక నల్లదనే భ్రమను కలిగిస్తాడు. తెల్లవారింది.. యధావిధిగా అనుకున్న విధంగా కద్రువ వినతలు ఇరువురూ ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఆ గుర్రాన్ని దూరం నుండే చూచారు. కర్కోటకుడు ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడడం మూలంగా ఆ తోక నల్లగా కనిపించడమూ... ఒప్పందం ప్రకారం వినత కద్రువకు దాసీగా మారడం జరుగుతుంది.
ఇలా ఐదు వందల సంవత్సరాలు గడచిపోయాయి.... ఒకనాడు వినత దగ్గరి అండం విచ్ఛిన్నమై గరుత్మంతుడనే పక్షి జనిస్తాడు. మహా బలవంతుడైన గరుడుడు కూడా తల్లి ఎలాగైతే కద్రువకు ఆమె సంతతికి దాసీత్వం చేస్తుందో అలాగే ఊడిగం చేస్తూంటాడు. ఒకనాడు.. ఆ పాములను తన వీపుపై మోస్తూ సూర్య మండలానికి ఎగరడం... ఆ తాపాన్ని భరించలేని పాములు భూమిపైపడి మూర్ఛ పోవడం, అది చూచిన కద్రువ కోపగించడం.... జరుగుతుంది. అప్పుడు, గరుత్మంతుడు తమ దాసీత్వం పోవాలంటే ఏం చేయాలని ఆ పాములను అడగడం వారు అమృతాన్ని తెచ్చిమ్మనడం... వారు కోరిన రీతిగానే దేవతలను జయించి గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి ఇస్తూ సర్పాలతో .... కృతస్నాతులై శుచిగా అమృతాన్ని సేవించడని చెప్పి... వారితో తన తల్లి దాసీత్వం పోయిందనిపించుకొని తల్లితో కలసి వెళ్ళిపోతాడు. ఆ పాములూ అమృతం లభించిందనే సంతోషంతో... ఆ అమృత భాండాన్ని శుచియైన ప్రదేశంలో దర్భలపై ఉంచి స్నానాదికాలు పూర్తి చేయడానికై వెళతారు. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి ఆ అమృత భాండాన్ని అపహరించుకొని వెళ్ళి దేవలోకంలో భద్ర పరుస్తాడు.
అమృతాన్ని తెచ్చే క్రమంలో ఆ అమృతాన్ని తాను ఉపయోగించని గరుడుని నిబద్ధతకు మరియు ఆతని జవసత్వాలను చూసి సంతోషించిన విష్ణువు గరుత్మంతుని తన వాహనంగా చేసుకుంటాడు.
స్థూలంగా ఇదీ కథ. ఇందులో ఎన్నో సందేహాలు..
౧) కశ్యపుడు మహాఋషి అన్నాము. ఋషి అంటేనే భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించ గలిగినవాడు. (అందులోనూ ఇతడు పశ్యకః...కశ్యప తిరగ వ్రాస్తే పశ్యక) అలాంటప్పుడు భార్యల కోరికలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయాడా?
౨) మహా తపస్వియైన భర్త చేసిన ఇష్టి యొక్క ప్రసాద మహాత్యాన్ని వినత నమ్మలేకపోయిందా లేక భర్తపై నమ్మకం పోయిందా? కద్రువకు సంతానం కలగగానే తన అండాన్ని విచ్ఛిన్నం చేయడం ఎందుకు?
౩) ఒక అంశంపై ఇరువురికీ వాద ప్రతివాదాలు చెలరేగాయి. పందెం వేద్దామనుకున్నారు. అది సహజమే కావచ్చు. కాని దానికి సొమ్ముల లాంటివి పందెంగా పెట్టడం సామాన్యమే కావచ్చు కాని ముందుకు ముందే దాసీత్వం పందెంగా వేసుకోవడం న్యాయమా?
౪) ఒక పెద్ద పందెం; అదీ జీవితాలకు సంబంధించినది ఐనప్పుడు, తెల్లవారి చూద్దాం లే అనే ప్రమత్తత ఉంటుందా?
౫) తెల్లవారి వెళ్ళి చూద్దామనుకున్నారు సరే! కాని ఆ తోక నలుపో తెలుపో దగ్గరకు వెళ్ళి చూస్తారే కాని దూరం నుండే దానిపై ఒక నిర్ణయానికి రావడం సమంజసమేనా? అలా ఎక్కడైనా జరుగుతుందా... అదీ దాసీత్వం పందెంగా ఉన్నప్పుడు.
౬) ఈ కథ ద్వారా వేద వ్యాసుడు ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడు?
ఈ సందేహాలు మీకూ వస్తే... నా ఆలోచనలు పంచుకునేందుకై రేపటి దాక వేచి ఉండండి. లేదా మీ మీ ఆలోచనలను పంచుకోండి
No comments:
Post a Comment