శ్రీ పతంజలి మహర్షి ప్రవచించిన అణిమ ఆదిగా గల అష్ట సిద్ధులు సాధన ద్వారా లభిస్తాయి. మూలాధారంలో సుప్తావస్థలో ఉన్న కుండలినీ శక్తి జాగృతమయి సహస్రారం దాకా పయనించడం లక్ష్యంగా సాగే సాధనయే యోగ సాధన. ఈ మార్గంలో సాధన చేసే సాధకుడు అనంతత్త్వాన్ని దర్శించి ప్రదర్శించ గలుగుతాడు. అనంత చైతన్యంలో తానూ అంతర్భాగమనే జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకో గలుగుతాడు. అనంతం నుండి అనంతం దాకా సాగే జీవుని సాధనా పథంలో "మూలాధార చక్రం"లో జాగృతమైన కుండలినీ శక్తి "స్వాధిష్ఠాన చక్రం" ద్వారా "మణిపూరకాని"కి, అక్కడి నుండి "అనాహతాని"కి అక్కడి నుండి "విశుద్ధ చక్రా"నికి అక్కడి నుండి "ఆజ్ఞా చక్రా"నికి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి "సహస్రారా"నికి చేరడం వల్ల అమృతత్త్వాన్ని సాధించడం జరుగుతుంది.
నిజానికి ప్రతి వ్యక్తీ అమృత స్వరూపుడే, అనంత శక్తివంతుడే, సకల సిద్ధులనూ సంగ్రహించుకున్న వాడే అయినా తనను తాను అనుభవ పూర్వకంగా తెలుసుకునే విధానానికి లేదా తన యదార్ధ రూపాన్ని దర్శించే విధానానికి దూరమవడం జరుగుతుంది. స్వస్వరూపాన్ని సందర్శింప గలిగిన ప్రజ్ఞ, అజ్ఞానం అనే మాయ వల్ల "అభాస" మయింది లేదా మూసివేయబడింది. ఆ ప్రజ్ఞను లేదా "తెలివి"ని లేదా "యెఱుక"ను జాగృతం చేసుకునే విధానమే యోగ సాధన.
ఈ యోగ సాధన క్రమంలో సాధకుడు అష్ట సిద్ధులను (ఎనిమిది అతీంద్రియ శక్తులను) సాధిస్తాడు. అవి....
అణిమా, మహిమా చైవ గరిమా లఘిమా తధా
ప్రాప్తిః ప్రాకామ్య మీశిత్వం వశిత్వం చాష్ట సిద్ధయః
అణిమా, మహిమా, గరిమా లఘిమా, ప్రాప్తిః, ప్రాకామ్యం, ఈశిత్వం మరియు వశిత్వం అనేవి అష్ట సిద్ధులుగా చెపుతుంది యోగ శాస్త్రం.
కుండలినీశక్తి స్వాధిష్ఠానంలోనికి ప్రవేశిస్తే సాధకునిలో అణిమ అనే సిద్ధి ప్రవేశిస్తుంది. దాని వల్ల సాధకుడు అవసరమైన వేళ పరమాణువు కన్నా కూడా సూక్ష్మంగా మారగలుగుతాడు. దానివల్ల తన మానసిక శక్తిని తన లక్ష్యానికి అనుసంధానించుకో గలుగుతాడు.
కుండలినీ శక్తి మణిపూరకంలోనికి ప్రవేశిస్తే సాధకునిలో మహిమ మరియు గరిమ అనే సిద్ధులు ప్రవేశిస్తాయి. వాటి వల్ల సాధకుడు దివ్యత్వాన్ని పొందుతాడు.
కుండలినీ శక్తి అనాహతంలో ప్రవేశించగానే లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం అనే శక్తులు సాధకునిలో ప్రవేశిస్తాయి. వాటి వల్ల అన్ని విషయాలూ తనకనుకూలంగా మారడం సంభవిస్తుంది.
కుండలినీ శక్తి విశుద్ధ చక్రంలో ప్రవేశించగానే ఈశిత్వ సిద్ధి సాధకునికి లభిస్తుంది. సకల చరాచర సృష్టిలో తానే నిండి యుండడం తాను దర్శించగలుగుతాడు.
కుండలినీ శక్తి ఆజ్ఞాచక్రంలో ప్రవేశించగానే సాధకునిలో వశిత్వ సిద్ధి ప్రవేశిస్తుంది. దీని వల్ల సకల సృష్టినీ శాసించ గలుగుతాడు.
సాధారణంగా సాధకులు ఈ స్థితిలో స్తబ్దతను ఆశ్రయిస్తారు. సమాధి స్థితిగా పిలువబడే ఈ స్థితిలో ప్రశాంతతను అనుభవిస్తూ ఉండే సాధకుడు ముందుకు పోవడానికి ఇష్టపడడు. కాని ఎవరైతే తమ సాధనను నిలిపివేయకుండా, ఆనందంద్వారా లభిస్తున్న ప్రలోభాలకు లొంగకుండా ముందుకు సాగుతూ సహస్రారాన్ని చేరుతారో వారికి అమృతత్త్వం సిద్ధిస్తుందని యోగ శాస్త్రం చెపుతుంది.
ఇది ఆధ్యాత్మిక సాధనా మార్గంలో కలిగే సిద్ధి. అందరికీ ఆ సాధన సాధ్యమా? అంటే సాధ్యమే కాని అందరూ ఆ సిద్ధులను పొందేంత ప్రయత్నశీలురై ఉండకపోవచ్చు. వారికి ఆధ్యాత్మిక సాధనలో తమ ఎదుగుదల కన్న సమాజప్రగతిపై ఎక్కువ ఆకాంక్ష ఉండవచ్చు. అలాంటి వారికి ఈ సిద్ధుల ప్రయోజనం ఉండదా?
నిజానికి ప్రతి వ్యక్తీ అమృత స్వరూపుడే, అనంత శక్తివంతుడే, సకల సిద్ధులనూ సంగ్రహించుకున్న వాడే అయినా తనను తాను అనుభవ పూర్వకంగా తెలుసుకునే విధానానికి లేదా తన యదార్ధ రూపాన్ని దర్శించే విధానానికి దూరమవడం జరుగుతుంది. స్వస్వరూపాన్ని సందర్శింప గలిగిన ప్రజ్ఞ, అజ్ఞానం అనే మాయ వల్ల "అభాస" మయింది లేదా మూసివేయబడింది. ఆ ప్రజ్ఞను లేదా "తెలివి"ని లేదా "యెఱుక"ను జాగృతం చేసుకునే విధానమే యోగ సాధన.
ఈ యోగ సాధన క్రమంలో సాధకుడు అష్ట సిద్ధులను (ఎనిమిది అతీంద్రియ శక్తులను) సాధిస్తాడు. అవి....
అణిమా, మహిమా చైవ గరిమా లఘిమా తధా
ప్రాప్తిః ప్రాకామ్య మీశిత్వం వశిత్వం చాష్ట సిద్ధయః
అణిమా, మహిమా, గరిమా లఘిమా, ప్రాప్తిః, ప్రాకామ్యం, ఈశిత్వం మరియు వశిత్వం అనేవి అష్ట సిద్ధులుగా చెపుతుంది యోగ శాస్త్రం.
కుండలినీశక్తి స్వాధిష్ఠానంలోనికి ప్రవేశిస్తే సాధకునిలో అణిమ అనే సిద్ధి ప్రవేశిస్తుంది. దాని వల్ల సాధకుడు అవసరమైన వేళ పరమాణువు కన్నా కూడా సూక్ష్మంగా మారగలుగుతాడు. దానివల్ల తన మానసిక శక్తిని తన లక్ష్యానికి అనుసంధానించుకో గలుగుతాడు.
కుండలినీ శక్తి మణిపూరకంలోనికి ప్రవేశిస్తే సాధకునిలో మహిమ మరియు గరిమ అనే సిద్ధులు ప్రవేశిస్తాయి. వాటి వల్ల సాధకుడు దివ్యత్వాన్ని పొందుతాడు.
కుండలినీ శక్తి అనాహతంలో ప్రవేశించగానే లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం అనే శక్తులు సాధకునిలో ప్రవేశిస్తాయి. వాటి వల్ల అన్ని విషయాలూ తనకనుకూలంగా మారడం సంభవిస్తుంది.
కుండలినీ శక్తి విశుద్ధ చక్రంలో ప్రవేశించగానే ఈశిత్వ సిద్ధి సాధకునికి లభిస్తుంది. సకల చరాచర సృష్టిలో తానే నిండి యుండడం తాను దర్శించగలుగుతాడు.
కుండలినీ శక్తి ఆజ్ఞాచక్రంలో ప్రవేశించగానే సాధకునిలో వశిత్వ సిద్ధి ప్రవేశిస్తుంది. దీని వల్ల సకల సృష్టినీ శాసించ గలుగుతాడు.
సాధారణంగా సాధకులు ఈ స్థితిలో స్తబ్దతను ఆశ్రయిస్తారు. సమాధి స్థితిగా పిలువబడే ఈ స్థితిలో ప్రశాంతతను అనుభవిస్తూ ఉండే సాధకుడు ముందుకు పోవడానికి ఇష్టపడడు. కాని ఎవరైతే తమ సాధనను నిలిపివేయకుండా, ఆనందంద్వారా లభిస్తున్న ప్రలోభాలకు లొంగకుండా ముందుకు సాగుతూ సహస్రారాన్ని చేరుతారో వారికి అమృతత్త్వం సిద్ధిస్తుందని యోగ శాస్త్రం చెపుతుంది.
ఇది ఆధ్యాత్మిక సాధనా మార్గంలో కలిగే సిద్ధి. అందరికీ ఆ సాధన సాధ్యమా? అంటే సాధ్యమే కాని అందరూ ఆ సిద్ధులను పొందేంత ప్రయత్నశీలురై ఉండకపోవచ్చు. వారికి ఆధ్యాత్మిక సాధనలో తమ ఎదుగుదల కన్న సమాజప్రగతిపై ఎక్కువ ఆకాంక్ష ఉండవచ్చు. అలాంటి వారికి ఈ సిద్ధుల ప్రయోజనం ఉండదా?
బౌతిక జీవనంలో ప్రభావవంతమైన లేదా ప్రకాశవంతమైన నాయకుని ఎదుగుదలలో అణిమాది అష్ట సిద్ధులను ఎలా అన్వయిస్తాము?
అణిమ అంటే పరమాణువు కన్నా చిన్నగా కావడం: ఒక సంస్థలోని ఉద్యోగి; ఒక అటెండర్ కావచ్చు లేదా జనరల్ మేనేజర్ కావచ్చు, C.E.O. కావచ్చు లేదా యజమాని కావచ్చు తోటి వారిని సాదరంగా చిరునవ్వుతో పలకరించడం, ముందుగా తానే పలకరించడం, అందరికీ అందుబాటులో ఉండడం వల్ల తోటి ఉద్యోగులతో అనుబంధాన్ని పెంచుకోవడం సంభవిస్తుంది. ఎప్పుడైతే ఇరువురి మధ్య అరమరికలు లేని సంబంధం ఏర్పడుతుందో అప్పుడు అక్కడ భయం తొలిగిపోతుంది. ఆ సంస్థలో చిన్న పెద్ద అనే భేదభావన తొలిగిపోయి సంస్థ అభివృద్ధిలో అందరమూ భాగస్వాములమే అనే విశాల దృక్ఫథం ఏర్పడుతుంది. సంస్థలో ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కొక్క రంగంలో నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని గుర్తించి గౌరవించడం, ఆ నైపుణ్యం ముందు తన నైపుణ్యం చిన్నదనే సత్యాన్ని గుర్తించడం వల్ల తను చిన్నవాడిననే భావనను పొందగలిగితే (ఆత్మ న్యూనతను కాదు) అందరితో కలసిపోవడం సులభమే. వినయంతో ఎదుటి వారికి అవకాశం ఇస్తే సంస్థ అభివృద్ధికై ఉత్తమమైన సలహాలను పొందవచ్చు. సాధారణంగా ఉన్నతాధికారి ఎంత చనువిచ్చినా క్రింది స్థాయి ఉద్యోగి తన పరిధులు దాటడు. ఎప్పుడైనా అలాంటి అవాంఛనీయ సంఘటన లెదురైతే వాటిని మొగ్గలోనే త్రుంచివేయడం వల్ల ఇతరులకూ ఆ సంకేతాలను పంపడం సాధ్యపడుతుంది. క్రింద నిలుచోవడం వల్ల స్థిరత్వాన్ని పొందగలుగుతాము.
మహిమ అంటే ప్రభావవంతమైన స్థాయికి చేరడం. మన నిర్ణయాలు, మాటతీరు, ఇతరులతో మన సంబంధాలు, పనిచేసే విధానం, ఒక బృందాన్ని ఏర్పరచి ఆ బృందంతో కలసి పనిచేయడం, లక్ష్యాలను చేరే మార్గంలో అందరి వ్శ్వసనీయతను పొందడం వల్ల మనలోని ఉన్నత వ్యక్తిత్వం ఆవిష్కృతమై తోటివారిని ఆకర్శిస్తుంది. ఇతరులకు సేవలు అందించడం, ఇతరుల పనిలో సహకరించడం, తగిన సూచనలతో ప్రేరణ నందివ్వడం వల్ల పని సమయానికి పూర్తికావడమే కాక మనమూ మహిమాన్వితులుగా సంస్థలో నిలుస్తాము.
గరిమ అంటే గొప్పదనం. మన పనివిధానం మన స్థాయిని సూచిస్తుంది. ఏ అడ్డంకులూ లేకుండా నడచే పనివిధానం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించడం కష్టసాధ్యం. అడ్డంకుల నధిగమిస్తూ, తోటివారి బరువు బాధ్యతలలో భాగస్వామిగా నిలవడం వల్ల మన గొప్పదనం ఇనుమడిస్తుంది. బృందంలో మన విలువా పెరుగుతుంది. మనపై మనకు కలిగిన నమ్మకం వల్ల, మనపై పై అధికారులకు కలిగిన నమ్మకం వల్ల క్లిష్టతరమైన బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. దానితో మనకు నిర్వహణా సామర్ధ్యం పెరుగుతుంది. సంస్థలో మన కంటూ గుర్తింపు కలిగిన ఉన్నత స్థానం పదిలపడుతుంది.
లఘిమ అంటే అవసరమైన వేళ బరువు తగ్గించుకోవడం. ఏ సంస్థలోనైనా అన్ని పనులు ఒక్కరెవ్వరూ చేయలేరు. ఏ సంస్థ విజయమైనా ఉమ్మడి భాగస్వామ్యంతోనే సంభవిస్తుంది, స్థిరీకరింపబడుతుంది. బాధ్యతలను ఎదుటివారి సామర్ధ్యాన్ని గుర్తించి ఎవరెవరి స్థాయికి తగిన రీతిలో వారికి అప్పగించడం వల్ల మన పని సులువవుతుంది. అధికార వికేంద్రీకరణ వల్ల పనులు వేగవంత మౌతాయి. నిర్ణయాధికారాలు, తగిన వనరుల సమీకరణ అధికారం యోగ్యులు అర్హులు అయిన వారికి అప్పగించడం వల్ల అతి ముఖ్యమైన విషయాలపై మనసును కేంద్రీకృతం చేయగలుగుతాము. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం, ఉత్పాదనా సామర్ధ్యాన్ని పెంచడంవల్ల సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఉద్యోగులందరికీ ఉపాధి లభిస్తుంది. అప్పుల భారం తగ్గిన సంస్థ మరియు అహంభావం తగ్గిన వ్యక్తీ గమనం ప్రశాంతంగా ఉంటుంది.
ప్రాప్తి అంటే ప్రాప్తించడం లేదా లభించడం. ఏది లభించాలి? దేనినైతే లక్ష్యంగా పెట్టుకొని వెదుకుతున్నామో అది లభించడమే ప్రాప్తి. అయాచితంగా ఏదీ మనకు లభించదు... ఒకవేళ లభించినా అది సంతోషాన్నిస్తుందేమో కాని ఆనందాన్నివ్వదు. అదృష్టాన్ని నమ్ముకొనో, జ్యోతిష్యాన్ని నమ్ముకొనో సోమరిగా కూర్చుంటే ఏ ఫలితమూ రాదు. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం ప్రకృతిలో మరేదీ లేదు. అన్వేషణాశీలియై ముందుకు సాగిపోయే వ్యక్తి తప్పనిసరిగా విజయాన్ని పొందుతాడు. విజయమెప్పుడూ కృషీవలురనే వరిస్తుంది. సాధనాపటిమతో నిరంతరం ఉత్సాహం, సాహసం ఊపిరులుగా ఉద్యమించే వారే దేనినైనా పొందుతారు. అది అపజయమైనా బాధపడరు. ఆ అపజయాన్నుండి పొందిన స్పూర్తితో మరొక మార్గంలో గమిస్తారు, ఎక్కడ ఏ లోపం వల్ల తాము ఆశించిన ఫలితాన్ని పొందలేక పోయారో విచారించి, అవసరమైన మార్పులతో, చేర్పులతో విజయ మార్గంలో గమిస్తారు.
ప్రాకామ్యము అంటే విశిష్టంగా లేదా విశేషంగా కోరదగినది. కోరదగినది ఏది? ఏది భౌతిక జీవనంలో ప్రేయస్సును, ఆధ్యాత్మిక జీవనంలో శ్రేయస్సును ఇస్తుందో దానినే కోరాలి, అదే కోరదగినది కూడా. యద్భావం తద్భవతి. ఏది బలంగా కోరుకుంటామో అదే లభిస్తుంది లేదా భవిస్తుంది. దృఢ నిశ్చయంతో, సాధించగలననే అపారమైన విశ్వాసంతో, అచంచలమైన మనస్సుతో దేనిని కోరుతామో అది లభిస్తుంది. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. మన మనస్సుకు అఖండమైన శక్తి ఉంది. మన అంతర్మనస్సును నిత్యం ధ్యానాదులతో బలీయం చేసి దానికి నివేదించిన కోరికలను ఆ అంతర్మనస్సే భవించేట్టుగా చేస్తుంది. భక్తిశ్రద్ధలతో సమర్పణాభావంతో నలుగురికి మేలుకలగాలనే కాంక్షతో మనం నివేదించే కోరికలు కోరదగినవని ప్రకృతి తలుస్తే "తధాస్తు" అంటూ ఆ కోరికలను సిద్ధింప చేస్తుంది. కాకపోతే గాలిలో దీపం పెట్టి దైవంమీద భారం వేయడం వల్ల ప్రయోజనం ఉండదు. మనవంతు కృషి చేయడం తప్పనిసరి.
ఈశిత్వం అంటే అంతటా వ్యాప్తి చెందడం. బాధ్యత తీసుకొని సమర్ధతతో వ్యవహరిస్తూ కార్యాన్ని చక్కదిద్దే వ్యక్తికి కుటుంబంలో కాని, సంస్థలో కాని, సమాజంలో కానీ గుర్తింపు ఉంటుంది. అన్నింటా అతనే అవుతూ కార్యాన్ని చక్కదిద్దే సామర్ధ్యానికి తన తెలివితేటలను ప్రతినిత్యం పదను పెట్టుకోవడం, తన విజ్ఞానాన్ని అధునీకరించుకోవడం, అవసరమైన మార్పులు చేసుకుంటూ అనునిత్యం క్రొత్తదనాన్ని అన్వేషించడం వల్ల తన పరిధి పెరుగుతుంది. విస్తరించిన పరిధి విలువను పెంచుతుంది. విలువ ఔన్నత్యాన్ని పెంచుతుంది.
వశిత్వం అంటే అందరూ తన వశులై పనిచేయడం. ఎప్పుడైతే తోటివారికి తన సామర్ధ్యంపై నమ్మకం పెరుగుతుందో, తన విలువ సమాజంలో లేదా సంస్థలో పెరుగుతుందో అప్పుడు తన సూచనల కనుగుణంగా అందరూ పనులు చేయడం జరుగుతుంది. ప్రేమ, దయ, దాక్షిణ్యము, కరుణ, సంతోషం, ఆదరణ లాంటి చక్కని గుణాలు ఎవరిలోనైతే వెల్లివిరుస్తాయో అతడు వశిత్వ సిద్ధిని పొందినట్లే.
ఈ ప్రకృతిలో ఉన్నది ఒక్కటే... చూచేదృష్టిలో బేధమే కాని సృష్టిలో బేధం లేదు. ఏ విజ్ఞానమైన అన్వయించుకునే విధానాన్ని బట్టి దాని ప్రయోజనం కనిపిస్తుంది.
పైన చేసిన అన్వయం సరైనదా అంటే కావచ్చు కాకపోవచ్చు. ఇది ఒక రూపం. దీనికి మరెన్నో రూపాలు ఉండవచ్చు. ఒక్కొక్కరి ఆలోచనా విధానంలో రూపుదిద్దుకున్న ప్రజ్ఞ సమాజాన్ని ఒక్కొక్క కోణంలో చూపించవచ్చు, అభివృద్ధి చేయవచ్చు. ముఖే ముఖే సరస్వతి అన్నట్లుగా ఎవరి ఆలోచనా విధానం ఏ ఫలితాన్నిస్తుందో అది సమాజానికి ఎంత మేరకు ఉపకరిస్తుందో ఆ ఆలోచనను ప్రతిక్షేపించి నప్పుడు తెలుస్తుంది.
నా అలోచనకు ప్రతి రూపం పై అన్వయం. ఇదీ మొత్తంగా నాది అని చెప్పలేను. యోగ మార్గానికి సంబంధించిన విషయం యోగశాస్త్ర గ్రంథాలలో నుండి గ్రహించినది కాగా శ్రీ గట్టు నారాయణ గురూజీ గారి పాతంజలి యోగసూత్ర బోధామృతలహరి చదివాక మదిలో మెదిలిన భావానికి అక్షరరూపం రెండవ భాగం. (With due apologies to Sri Narayana guruji)
ఏ సూచనలైనా కృతజ్ఞతతో స్వీకరిస్తాను, అవసరమైన మేరకు మార్చుకుంటాను.
నమస్సులతో
Palakurthy Rama Murthy
9441666943